వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి రాజకీయ హీరో అని మాజీ ఎంపి హరిరామజోగయ్య అన్నారు. సాక్షిటివి 'న్యూస్ మేకర్' కార్యక్రమంలో అయన మాట్లాడారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో జగన్ తోపాటు తాను పర్యటించానని చెప్పారు. జగన్ ఏ గ్రామానికి వెళ్లినా ఆయనని చూసేందుకు గ్రామస్తులు అందరూ తరలివస్తున్నారన్నారు. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారని చెప్పారు. 'జగన్ ని చూసేందుకు జనం ఎందుకు ఇలా తరలి వస్తున్నారని ఆలోచించాను. ఆయన సినిమా హీరో కాదు. ఏ సినిమాలో నటించలేదు. అయినా ఎందుకు ఇంతమంది ఆయనని చూసేందుకు వస్తున్నారు? ఆయన ప్రస్తుతం ప్రజా నాయకుడు, పొలిటికల్ హీరో. ఇన్నేళ్ల నా రాజకీయ అనుభవంతో చెబుతున్నాను. 2014లో జగనే సిఎం. ఇది నా మాట కాదు. ప్రజల మాట' అని అన్నారు.
ప్రజారాజ్యం పార్టీలో చేరడం తన జీవితంలో చేసిన పెద్దతప్పు అని బాధపడ్డారు. ఉపఎన్నికల విషయంలో ఆంధ్రజ్యోతి సర్వే బోగస్ అని చెప్పారు. వాళ్లు మద్దతు తెలిపే పార్టీ గెలుస్తుందని చెప్పి, ఓటర్లను ఆ పార్టీ వైపు తిప్పుకునే విధంగా ఇటువంటి సర్వేలు ప్రకటిస్తుంటారని వివరించారు.
కాంగ్రెస్ పార్టీ చర్యలే జగన్ ని హీరోని చేశాయన్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నీతిమంతులా? ఎవరేంటో ప్రజాకోర్టులో తేలుతుందని హరిరామజోగయ్య అన్నారు.
0 comments:
Post a Comment