వైఎస్ ప్రభుత్వ నిర్ణయాలపై కాంగ్రెస్ వైఖరి... సొంతపార్టీనే అప్రతిష్ట పాలు చేసేలా ఉందని మాజీమంత్రి జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ సర్కార్ లా ఉత్తరప్రదేశ్ ను అభివృద్ధి చేసామని యూపీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రచారం చేస్తే... రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారన్నారు.
చంద్రబాబుకు ఎమ్మార్ కు భూకేటాయింపులు, ఆయన కోడలు బ్రహ్మణికి విల్లాల కేటాయింపు, క్విడ్ ప్రో కో కాదా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ అంశంలో బాబుపై ఎందుకు విచారణ జరపలేదని, ఇతర రాష్ట్రాల పరిశ్రమలకు భూమిని కేటాయిస్తే తప్పులేంది... మన రాష్ట్రంలో వైఎస్ సర్కార్ చేస్తే తప్పెలా అవుతుందని ఆయన ప్రశ్నలు సంధించారు. ఢిల్లీలో వైఎస్ ను పొగుడుతూ రాష్ట్రంలో ఆయన ఇమేజ్ ను దెబ్బతీసే కుట్ర జరుగుతుందని ఆయన అన్నారు.
చంద్రబాబుకు ఎమ్మార్ కు భూకేటాయింపులు, ఆయన కోడలు బ్రహ్మణికి విల్లాల కేటాయింపు, క్విడ్ ప్రో కో కాదా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ అంశంలో బాబుపై ఎందుకు విచారణ జరపలేదని, ఇతర రాష్ట్రాల పరిశ్రమలకు భూమిని కేటాయిస్తే తప్పులేంది... మన రాష్ట్రంలో వైఎస్ సర్కార్ చేస్తే తప్పెలా అవుతుందని ఆయన ప్రశ్నలు సంధించారు. ఢిల్లీలో వైఎస్ ను పొగుడుతూ రాష్ట్రంలో ఆయన ఇమేజ్ ను దెబ్బతీసే కుట్ర జరుగుతుందని ఆయన అన్నారు.
0 comments:
Post a Comment