వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు

వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు

Written By news on Friday, August 24, 2012 | 8/24/2012


ఇటిక్యాల(మహబూబ్‌నగర్), న్యూస్‌లైన్: మహబూబ్‌నగర్ జిల్లాలో వైఎస్సార్సీపీలోకి గురువారం టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరారు. వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, సీఈసీ సభ్యులు రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామరెడ్డి తదితరులు వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటిక్యాల తాజా మాజీ ఎంపీపీ జి.ఖగున్నాథ్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు లలితమ్మ, సింగిల్‌విండో చైర్మన్ మాణిక్యరెడ్డితో పాటు ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు, మరో 16మంది సర్పంచ్‌లతో సహా మూడువేల మంది కార్యకర్తలు పార్టీలో చేరిన వారిలో వున్నారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమపథకాల అమలు కేవలం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమవుతుందని, అందుకే ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు పార్టీలో చేరామన్నారు. అంతముందు వారు ఎర్రవల్లి చౌరస్తా నుంచి బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
Share this article :

0 comments: