డ్రైనేజీ సమస్య పరిష్కరించండి: భూమన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » డ్రైనేజీ సమస్య పరిష్కరించండి: భూమన

డ్రైనేజీ సమస్య పరిష్కరించండి: భూమన

Written By news on Wednesday, August 22, 2012 | 8/22/2012

శ్రీవారి పాదాల చెంత ఉన్న తిరుపతి మురికి కూపంలా మారింది. చినుకు పడితే చాలు తిరుపతి మొత్తం చిత్తడే. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ప్రయోజనం శూన్యం. దాంతో డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి బుధవారం ఉదయం తిరుపతి డీఆర్ మహల్‌ రైల్వే అండర్‌ బ్రిడ్జి దగ్గర మురికి నీటిలో దిగారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికల సందర్భంగా తిరుపతికి రూ.450 కోట్ల అభివృద్ధి నిధులు ఇస్తామన్న ప్రభుత్వం తక్షణమే ఆ నిధులు విడుదల చేయాలన్నారు. లేకుంటే భవిష్యత్ లో మరిన్ని పోరాటాలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇచ్చిన మాటను కిరణ్ సర్కార్ నిలబెట్టుకోవాలన్నారు.
Share this article :

0 comments: