బాబు హయాం నుంచి విచారణ జరపాలి: అంబటి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు హయాం నుంచి విచారణ జరపాలి: అంబటి

బాబు హయాం నుంచి విచారణ జరపాలి: అంబటి

Written By ysrcongress on Sunday, January 8, 2012 | 1/08/2012

ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసుని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హయాం నుంచి విచారణ జరపాలని సిబిఐకి చెప్పినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఏపిఐఐసి మాజీ చైర్మన్ అంబటి రాంబాబు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సిబిఐ ముందు సాక్షిగా హజరైన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎసిఐఐసి వాటా తగ్గింపు విషయం చంద్రబాబు హయాంలో జారీ చేసిన జీవోలోని 359లోని క్లాజ్ వల్లే జరిగిందన్నారు. ఆ క్లాజ్ వల్లే ఎంజిఎఫ్ ఏజన్సీగా వచ్చిందన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్, ఎంజిఎఫ్ మధ్య జరిగిన ఒప్పందం గురించి, తనకు గానీ, బోర్డుకు గానీ తెలియదని చెప్పారు. చైర్మన్ గా తాను పదవీ విరమణ చేసిన తరువాతే ఒప్పందం గురించి తెలిసిందన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో సాక్షిగా మాత్రమే తాను విచారణకు హాజరయ్యానని తెలిపారు. సీబీఐ అధికారులు వాళ్లకు కావాల్సిన వివరాలు అడిగారని, తనకు తెలిసిన సమాధానాలు చెప్పానన్నారు. కేసుకు సంబంధించిన వివరాలు మాత్రమే సీబీఐ అధికారులు తనను అడిగారని అంబటి చెప్పారు. తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి ఆస్తుల కేసుకు సంబంధించి తనని ఏమీ అడగలేదని చెప్పారు.
Share this article :

0 comments: