100 టీడీపీ కుటుంబాలు వైఎస్‌ఆర్‌సీపీలోకి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 100 టీడీపీ కుటుంబాలు వైఎస్‌ఆర్‌సీపీలోకి

100 టీడీపీ కుటుంబాలు వైఎస్‌ఆర్‌సీపీలోకి

Written By ysrcongress on Sunday, January 1, 2012 | 1/01/2012

రాయచోటి (వైఎస్‌ఆర్ జిల్లా), న్యూస్‌లైన్ : నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బాసటగా నిలిచిన 100 కుటుంబాలు శనివారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. పార్టీ మైనార్టీ నాయకుడు మండీ మగ్బూల్‌బాషా, అయన తనయుడు మహబూబ్‌బాషాల ఆధ్వర్యంలో వారంతా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. రాయచోటి మినీలారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్‌కు చెందిన రియాజ్ నేతృత్వంలో ఫర్హన్, మహమ్మద్‌అలీ, షౌకత్, ఇనాయత్‌లతో పాటు పలువురు ఈ సందర్భంగా పార్టీతీర్థం పుచ్చుకున్నారు. 

వీరందరికి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మైనార్టీ నేతలు గఫార్‌సాహెబ్, ఆప్జల్‌అలీ ఖాన్, మహబూబ్‌బాషా తదితరులు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు స్థానిక స్థానిక అలీమాబాద్‌వీధిలోని మగ్బూల్‌మండీలో ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ సీపీ ముస్లిం, మైనార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల నమ్మకాన్ని వైఎస్ జగన్ నిలబెడతారన్నారు.
Share this article :

0 comments: