తెలంగాణ ప్రాంతంలో జగన్ తలపెట్టనున్న ఓదార్పుయాత్రను అడ్డుకుంటే తెలంగాణ ద్రోహులవుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కొండా సురేఖ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్రను చిత్తూరు జిల్లాలోని మంగళంలో సురేఖ ప్రారంభించారు. ఈ పాదయాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు భూమన కరుణాకరరెడ్డి, నారాయణస్వామి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ప్రతాపరెడ్డిలు పాల్గొన్నారు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత ఉందో రానున్న ఉప ఎన్నికల్లో తేలుతుందని సురేఖ అన్నారు.
మద్యపానానికి వ్యతిరేకంగా మహిళల్లో సామాజిక విప్లవం రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. మద్యమే ప్రధాన ఆదాయంగా రాష్ట్ర ప్రభుత్యం నడుస్తోందని ఆమె మండిపడ్డారు. చీప్ లిక్కర్ ధరల మీద నియంత్రణ లేకపోవడం వల్ల పలు అనర్ధాలు చోటు చేసుకుంటున్నాయని పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. కల్లీసారాకు బలైన వారికి ఎక్స్గ్రేషియా చెల్లించి. చేతులు దులుపుకోవడం సర్కార్కు అలవాటైపోయిందని పద్మ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడారు.
మద్యపానానికి వ్యతిరేకంగా మహిళల్లో సామాజిక విప్లవం రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. మద్యమే ప్రధాన ఆదాయంగా రాష్ట్ర ప్రభుత్యం నడుస్తోందని ఆమె మండిపడ్డారు. చీప్ లిక్కర్ ధరల మీద నియంత్రణ లేకపోవడం వల్ల పలు అనర్ధాలు చోటు చేసుకుంటున్నాయని పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. కల్లీసారాకు బలైన వారికి ఎక్స్గ్రేషియా చెల్లించి. చేతులు దులుపుకోవడం సర్కార్కు అలవాటైపోయిందని పద్మ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడారు.
0 comments:
Post a Comment