కృష్ణా జిల్లా మైలవరం క ల్తీ సారా బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ పరామర్శించారు. పోరాటనగర్, కనిమెర్లతండా, నాగులూరు తండాల్లో కల్తీ సారా మృతుల కుటుంబాలను పరామర్శించిన ఆయన మంగళవారం రాత్రి విజయవాడకు చేరుకున్నారు. కల్తీ సారా తాగి అస్వస్థతకు గురై హెల్ప్, ఆంధ్రా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్నివిధాలా అండగా ఉంటామని వారికి జగన్ భరోసా ఇచ్చారు.
యువత, మహిళల జీవితాలను తెలిసే నాశనం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ, ప్రతిపక్ష తీరుపై నిప్పులు చెరిగారు. కనిమెర్లలో కల్తీసారా తాగి మృత్యువాత పడిన వ్యక్తుల కుటుంబాల్ని పరామర్శించిన అనంతరం మీడియాతో జగన్ మాట్లాడారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. సువర్ణ పాలనను అందిస్తామన్నారు. త్వరలోనే సువర్ణ యుగం రాబోతుందని.. గ్రామాల్లో బెల్టు షాపులు, మద్యం దుకాణాలు ఉండ కుండా చర్యలు తీసుకుంటామని జగన్ తెలిపారు. ప్రతి వెయి మంది ఉన్న గ్రామానికి 10 మంది మహిళా పోలీసులున్న స్టేషన్ను ఏర్పాటు చేస్తామన్నారు.
దినమంతా కష్టపడిన వ్యక్తికి ఒక పెగ్గు సారా ఉండాలని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై జగన్ మండిపడ్డారు. ఇంటింటికి పెగ్గు అన్న చంద్రబాబు ఆలోచన తప్పు అన్నారు. ఎక్సైజ్ అధికారులకు ప్రభుత్వం టార్గెట్లను పెడుతోందని ఆయన విమర్శించారు. కల్తీ సారా తయారు చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయని దయనీయస్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు.
యువత, మహిళల జీవితాలను తెలిసే నాశనం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ, ప్రతిపక్ష తీరుపై నిప్పులు చెరిగారు. కనిమెర్లలో కల్తీసారా తాగి మృత్యువాత పడిన వ్యక్తుల కుటుంబాల్ని పరామర్శించిన అనంతరం మీడియాతో జగన్ మాట్లాడారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. సువర్ణ పాలనను అందిస్తామన్నారు. త్వరలోనే సువర్ణ యుగం రాబోతుందని.. గ్రామాల్లో బెల్టు షాపులు, మద్యం దుకాణాలు ఉండ కుండా చర్యలు తీసుకుంటామని జగన్ తెలిపారు. ప్రతి వెయి మంది ఉన్న గ్రామానికి 10 మంది మహిళా పోలీసులున్న స్టేషన్ను ఏర్పాటు చేస్తామన్నారు.
దినమంతా కష్టపడిన వ్యక్తికి ఒక పెగ్గు సారా ఉండాలని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై జగన్ మండిపడ్డారు. ఇంటింటికి పెగ్గు అన్న చంద్రబాబు ఆలోచన తప్పు అన్నారు. ఎక్సైజ్ అధికారులకు ప్రభుత్వం టార్గెట్లను పెడుతోందని ఆయన విమర్శించారు. కల్తీ సారా తయారు చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయని దయనీయస్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు.
1 comments:
Very nice post brother ! Keep up the good work ! Jai Jagan Anna ! Johar YSR !
Post a Comment