వైఎస్ఆర్ సీపీ నేత తోట గోపాలకృష్ణ మృతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ నేత తోట గోపాలకృష్ణ మృతి

వైఎస్ఆర్ సీపీ నేత తోట గోపాలకృష్ణ మృతి

Written By ysrcongress on Thursday, January 5, 2012 | 1/05/2012

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తోట గోపాలకృష్ణ గురువారం కన్నుమూశారు. రెండుసార్లు ఎంపీగా గెలుపొందిన ఆయన 2004లో పెద్దాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తూర్పుగోదావరి జిల్లా మెట్టప్రాంతానికి చెందిన కీలక నేతగా గోపాలకృష్ణకు పేరుంది. 

రొటీన్ చెకప్ లో భాగంగా ఆయన కొన్నిరోజుల కిందట నిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లారు. బైపాస్ సర్జరీ చేయించుకోవాలని డాక్టర్ల సూచించడంతో ఆపరేషన్ చేయించుకున్నారు. బైపాస్ సర్జరీ తర్వాత ఒక్కసారిగా గోపాలకృష్ణ ఆరోగ్యం విషమించింది. దాంతో మెరుగైన చికిత్స కోసం బంధువుల కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించిందని డాక్టర్లు స్పష్టం చేశారు. చికిత్స పొందుతూ ఆయన ఈరోజు మధ్యాహ్నం మృతి చెందారు.

నిమ్స్ వైద్యులు సర్జరీ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదని గోపాలకృష్ణ బంధువుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ఓ కుమార్తె, ఓ కుమారుడు. కాగా గోపాలకృష్ణ మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు.
Share this article :

0 comments: