ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్ సీపీ ఉద్యమం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్ సీపీ ఉద్యమం

ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్ సీపీ ఉద్యమం

Written By news on Saturday, January 5, 2013 | 1/05/2013

విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనను వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. గత మూడేళ్లలో కరెంట్‌ ఛార్జీలు పేరుతో ఈ ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతోందని ఆ పార్టీ నేత జనక్‌ప్రసాద్‌ శనివారమిక్కడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛార్జీల పెంపుపై ప్రతిపక్షం స్పందింకపోవడం దారుణమని ఆయన మండిపడ్డారు. కరెంట్‌ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమిస్తుందని జనక్‌ప్రసాద్‌ తెలిపారు. దీనిపై తర్వలోనే కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

ధన్వాడ: విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలం మరికల్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. రెడ్డిగారి రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. వెంటనే కరెంట్ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ నిరసనతో రాయిచూర్- మహబూబ్‌నగర్ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
Share this article :

0 comments: