రాష్ట్రంలో ప్రస్తుతం అసమర్థ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి దుష్టపాలన సాగుతోందని, ఆ పాలనకు చరమగీతం పాడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన రామసముద్రం మండలంలోని అరికెల, చెంబకూరు, కొండూరు, రామసముద్రం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీతో కుమ్మక్కై ఆయనను జైలుకు పంపిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్ని బీసీ మంత్రులనే జైలుకు పంపుతోందని ఆరోపించారు.
Home »
» జగన్ నాయకత్వాన్ని బలపరచండి
జగన్ నాయకత్వాన్ని బలపరచండి
Written By news on Wednesday, January 23, 2013 | 1/23/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment