కొత్తగా మందులు కనుగొన్నప్పుడు పరిశోధనలు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కొత్తగా వచ్చే ఆలోచనలను ఆంధ్రప్రదేశ్పై ప్రయోగిస్తోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా ఎన్నికల పరిశీలకుడు పి.గౌతమ్రెడ్డి ‘గడప గడపకు గౌతమ్రెడ్డి - డివిజన్ నిద్ర’ కార్యక్రమాన్ని విజయవాడలో చేపట్టారు. ఆదివారం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అంబటి మాట్లాడుతూ తెలంగాణ అంశంపై అన్ని పార్టీల అభిప్రాయాలను కాంగ్రెస్ సేకరిస్తుంది కానీ తన అభిప్రాయాన్ని మాత్రం చెప్పదన్నారు. అయితే ఆ పార్టీ నాయకులకు మాత్రం తెలంగాణ అంశంపై లీకులు ఇచ్చి, ప్రజల నుంచి వచ్చే స్పందనను గమనిస్తూ ఉంటారని విమర్శించారు. గత మూడేళ్లుగా ఉద్యమాల కారణంగా రాష్ట్ర సర్వనాశనం అయినా కేంద్రం ఇంకా ప్రయోగాలు చేస్తూనే ఉందని ఆరోపించారు. సమైకాంధ్ర విడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని లగడపాటి ప్రకటించడం హస్యాస్పదమన్నారు. ఆయన తప్పుకోవాల్సిన అవసరం లేదని, ఎన్నికలు వస్తే ప్రజలే ఆయన్ను తప్పిస్తారని అంబంటి అభిప్రాయపడ్డారు.
Home »
» కాంగ్రెస్కు ప్రయోగశాలగా రాష్ట్రం
కాంగ్రెస్కు ప్రయోగశాలగా రాష్ట్రం
Written By news on Monday, January 21, 2013 | 1/21/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment