సీబీఐని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు: రామచంద్రరావు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు: రామచంద్రరావు

సీబీఐని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు: రామచంద్రరావు

Written By news on Friday, May 10, 2013 | 5/10/2013

‘‘సీబీఐ వాళ్లు మొదటి నుంచీ ఒకటే మాట చెప్తున్నారు. తాము సుప్రీంకోర్టులో ఏం చెప్పినా.. తమకు కావలసిన విధంగా చేసుకునేది చేసుకుంటామంటున్నారు. చార్జిషీట్లో పేర్లున్న మంత్రులేమో బయట తిరుగుతున్నారు.. పదవులు అనుభవిస్తున్నారు. అందువల్లే సీబీఐ దర్యాప్తే రాజకీయ ప్రేరేపితంగా సాగుతోందన్న భావన సామాన్య ప్రజల్లో వచ్చేసింది. ఒక మనిషిని రాజకీయంగా ఫినిష్ చేయడానికి వీలుగా అతడిని బయటకు రాకుండా చేయాలనే ఉద్దేశంతో దర్యాప్తు సాగుతున్నట్లు స్పష్టంగా కనపడుతోంది. అయితే జగన్‌ను జైల్లో పెట్టి రాజకీయంగా ఫినిష్ చేద్దామనుకుంటే వీలుపడలేదు. 

ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నప్పటికీ... ఉప ఎన్నికల్లో.. అందరికీ కలిపి వచ్చిన ఓట్లకంటే ఈయన పార్టీ అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈయన బయటకొస్తే.. తమ పార్టీకి ఇంకా నష్టమనే వాళ్లు ఇదంతా చేస్తున్నారు. అందుకే ఏడాదిగా దర్యాప్తు సాగుతూ ఉన్నట్లు కనిపిస్తోంది. జగన్‌గాని, ఆయన మనుషులుగాని ఇప్పుడు బయట ఉంటే.. రూలింగ్ పార్టీని పడగొట్టగలరన్న భయం వారి కుంది. అందుకే సీబీఐని ఒక పనిముట్టుగా వాడుకుంటున్నారన్న ఫీలింగ్ సామన్య ప్రజల్లోకూడా వచ్చేసింది. 

సీబీఐ స్వతంత్రత నిన్న, మొన్న జరిగిన బొగ్గు కుంభకోణం కేసుల్లోనే తేటతెల్లమైంది. మంత్రులే సీబీఐ అధికారులను పిలిపించుకుని నివేదికలు చూసి మారుస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సీబీఐ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. సీబీఐ పంజరంలో చిలకలా.. ఒక యజమాని చెప్పినట్లు ఆడుతోందని వేరే కేసుల్లో వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు.. జగన్ కేసు విషయంలో మాత్రం సీబీఐ చెప్పిందే బైబిల్ అన్నట్లు నమ్ముతోంది.’’
- రామచంద్రరావు, హైకోర్టు సీనియర్ న్యాయవాది

http://www.sakshi.com/main/FullStory.aspx?catid=595794&Categoryid=1&subcatid=33
Share this article :

0 comments: