టిడిపి అధికారప్రతినిధి 'ఈనాడు': అంబటి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టిడిపి అధికారప్రతినిధి 'ఈనాడు': అంబటి

టిడిపి అధికారప్రతినిధి 'ఈనాడు': అంబటి

Written By news on Friday, May 10, 2013 | 5/10/2013

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా 'ఈనాడు' వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో చంద్రబాబు పేరు రాయవలసిన చోట ఈనాడులో అప్పటి ముఖ్యమంత్రి అని రాశారని తెలిపారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కు కారు చౌకగా భూమి కట్టబెట్టింది చంద్రబాబు అని చెప్పారు. ఎకరం దాదాపు 4 కోట్ల రూపాయలు ధర ఉన్న సమయంలో కేవలం 29 లక్షల రూపాయలకే ఇచ్చారని వివరించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడుపై సిబిఐ ఎందుకు విచారణ జరపడంలేదని ఆయన ప్రశ్నించారు.
Share this article :

0 comments: