వైఎస్సార్గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఒక పనిమీద క్యాంప్ కార్యాలయానికి వెళ్లాను. ఆయన నా రిప్రజెంటేషన్ తీసుకుని, తన పి.ఎస్. కిరణ్కుమార్రెడ్డితో, ‘‘వెంటనే కృష్ణా కలెక్టరుతో మాట్లాడి మాస్టారి సమస్యను పరిష్కరించమని చెప్పండి’’ అన్నారు. ‘‘మీరు వెళ్లి కలెక్టరును కలవండి’’ అని నాతో చెప్పారు. వారం రోజుల తర్వాత నేను కలెక్టర్ని కలిశాను. ఆయన సానుకూలంగా స్పందించి, మా పని పూర్తిచేస్తానని చెప్పారు.
ఆ మరుసటి నెలలో ఒకరోజు ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రయాణించే హెలికాప్టర్ దారితప్పిందని టీవీలో చూశాను. తర్వాత చనిపోయారని తెలిసింది. ఆ రోజల్లా నేను భోజనం చేయలేదు. వాతావరణం బాగాలేనందున ఆ రోజు ఆగితే బాగుండేదని ఏ వందసార్లో అనుకున్నాను. ఆ టైమ్లో నా గుండె వేగం గమనిస్తే, గుండె ఆగిపోతుందేమోననే భయం కలిగింది. మరుసటి రోజు క్యాంపు కార్యాలయానికెళ్లి జగన్గారికి నా సహానుభూతి తెలిపివచ్చాను.
వైఎస్సార్గారు చనిపోయిన తర్వాత తండ్రి చనిపోయిన బిడ్డల మాదిరిగా రాష్ట్ర ప్రజల పరిస్థితి మారిపోయింది. ఆయన వల్ల మేలుపొందినవారు కూడా ఆ కుటుంబాన్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు. భగవంతుడు అన్నీ చూస్తున్నాడు. అల్లా దయవల్ల జగన్ కడిగిన ముత్యంలా బయటికొస్తారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ఆ రోజు కోసం జనమంతా ఎదురుచూస్తున్నారు.
- యస్.ఎం.సుభాని, నందిగామ, కృష్ణా జిల్లా
ఆ మరుసటి నెలలో ఒకరోజు ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రయాణించే హెలికాప్టర్ దారితప్పిందని టీవీలో చూశాను. తర్వాత చనిపోయారని తెలిసింది. ఆ రోజల్లా నేను భోజనం చేయలేదు. వాతావరణం బాగాలేనందున ఆ రోజు ఆగితే బాగుండేదని ఏ వందసార్లో అనుకున్నాను. ఆ టైమ్లో నా గుండె వేగం గమనిస్తే, గుండె ఆగిపోతుందేమోననే భయం కలిగింది. మరుసటి రోజు క్యాంపు కార్యాలయానికెళ్లి జగన్గారికి నా సహానుభూతి తెలిపివచ్చాను.
వైఎస్సార్గారు చనిపోయిన తర్వాత తండ్రి చనిపోయిన బిడ్డల మాదిరిగా రాష్ట్ర ప్రజల పరిస్థితి మారిపోయింది. ఆయన వల్ల మేలుపొందినవారు కూడా ఆ కుటుంబాన్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు. భగవంతుడు అన్నీ చూస్తున్నాడు. అల్లా దయవల్ల జగన్ కడిగిన ముత్యంలా బయటికొస్తారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ఆ రోజు కోసం జనమంతా ఎదురుచూస్తున్నారు.
- యస్.ఎం.సుభాని, నందిగామ, కృష్ణా జిల్లా
0 comments:
Post a Comment