మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం 111వ రోజు గురువారం నడిపూరు నుంచి ప్రారంభమవుతుందని ఆ పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. అగ్రహారం, రెడ్డిపాలెం సెంటర్, వడ్లమన్నాడు, వేమవరం వరకు పాదయాత్ర సాగిన తరువాత విరామం ఉంటుందని చెప్పారు. అనంతరం కౌతవరం రోడ్డు, గుడ్లవల్లేరు వరకు పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. షర్మిల రాత్రి అక్కడే బసచేస్తారని తెలిపారు.
పర్యటించే ప్రాంతాలు
నడిపూరు, అగ్రహరం, రెడ్డిపాలెం, వడ్లమన్నాడు, వేమవరం,
కౌతవరం, గుడ్లవల్లేరు
పర్యటించే ప్రాంతాలు
నడిపూరు, అగ్రహరం, రెడ్డిపాలెం, వడ్లమన్నాడు, వేమవరం,
కౌతవరం, గుడ్లవల్లేరు
0 comments:
Post a Comment