2జి స్పెక్ట్రమ్ పాపం యుపిఏదేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఈరోజు ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ కూపంలోకి రాజాని నెట్టివేసి పెద్దలు తప్పుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. రాజాని బలి చేశారని విమర్శించారు. వాస్తవానికి ఈ స్కాంలో కేంద్ర మంత్రి వర్గందే బాధ్యత అన్నారు. రాజ్యాంగంలోని 74వ ఆర్టికల్ ఇదే చెబుతోందని చెప్పారు.
స్కాంలో నుంచి కేంద్ర మంత్రి చిదంబరంని ఎలా తొలగిస్తారని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో సీనియర్ మంత్రి ప్రణబ్ ముఖర్జీయే ఈ స్కాంలో చిదంబరంకు ప్రమేయం ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు.
ఎమ్మార్ ప్రాపర్టీస్ విషయంలో ఎండిని బలి చేశారన్నారు. మంత్రి మాత్రం క్షేమంగా ఉన్నారన్నారని చెప్పారు. మంత్రులను, నేతలను సిబిఐ వదిలివేసిందన్నారు. మంత్రి వర్గ ఉపసంఘాన్ని కూడా సిబిఐ వదిలివేసిందని విమర్శించారు.
స్కాంలో నుంచి కేంద్ర మంత్రి చిదంబరంని ఎలా తొలగిస్తారని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో సీనియర్ మంత్రి ప్రణబ్ ముఖర్జీయే ఈ స్కాంలో చిదంబరంకు ప్రమేయం ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు.
ఎమ్మార్ ప్రాపర్టీస్ విషయంలో ఎండిని బలి చేశారన్నారు. మంత్రి మాత్రం క్షేమంగా ఉన్నారన్నారని చెప్పారు. మంత్రులను, నేతలను సిబిఐ వదిలివేసిందన్నారు. మంత్రి వర్గ ఉపసంఘాన్ని కూడా సిబిఐ వదిలివేసిందని విమర్శించారు.
0 comments:
Post a Comment