వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శనివారం నాటి పర్యటనలో మార్పులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శనివారం నాటి పర్యటనలో మార్పులు

వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శనివారం నాటి పర్యటనలో మార్పులు

Written By ysrcongress on Saturday, February 4, 2012 | 2/04/2012

యువనేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శనివారం నాటి పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు తండ్రి శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందారు. దీంతో ప్రసాదరాజు కుటుంబాన్ని పరామర్శించడానికి శని వారం పాలకొల్లు వెళ్లాలని జగన్ నిర్ణయించారు. ఆయన శనివారం ఉదయం నగరంలోని పోర్టు కళావాణి స్టేడియంలో జరిగే శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు కుమారుడు, నర్సీపట్నం శాసనసభ్యురాలు బోళెం ముత్యాలపాప కుమార్తె వివాహానికి హాజరవుతారు. నగరంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

అనంతరం నేరుగా న ర్సాపురం ఎమ్మెల్యే స్వగ్రామం పాలకొల్లుకు బయల్దేరి వెళ్తారు. అనుకోని ఈ పరిణామాలతో జగన్ పాయకరావుపేట నియోజకవర్గంలో నిర్వహించ తలపెట్టిన పర్యటన, రోడ్డుషోను రద్దు చేసుకున్నారు. వాస్తవానికి నగరంలో శనివారం ఉదయం వివిధ కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నం పాయకరావుపేట పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే తాజా పరిణామాలతో పాయకరావుపేట పర్యటనను వాయిదా వేశారు. జగన్ పాయకరావుపేట నియోజకవర్గంలో తిరిగి పర్యటించే తేదీని త్వరలో ప్రకటిస్తారు.
Share this article :

0 comments: