Home »
» మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా..
మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా..
|
వైఎస్.రాజశేఖర్రెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరోప్రజాప్రస్థానం పాదయాత్ర 139వ రోజు ఆదివారం జిల్లాలో 10.2 కిలోమీటర్లు సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు తెలిపారు. వేపలగడ్డ శివారు నుంచి ప్రారంభమై కొత్తగూడెం పట్టణంలోని భజన మందిరం వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బస కేంద్రంలో షర్మిల బస చేస్తారని తెలిపారు. పర్యటించే ప్రాంతాలు మంగపేటతండా క్రాస్రోడ్, బృందావనం, హౌజింగ్ బోర్డు కాలనీ, విద్యానగర్ కాలనీ, ఎన్కె నగర్, పోస్టాఫీస్ సెంటర్, బస్టాండ్ సెంటర్, రైల్వే స్టేషన్, మార్కెట్ సెంటర్, పాత డిపో, భజన మందిర్.
|
|
0 comments:
Post a Comment