వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం జిల్లాకు రానున్నారు. కొత్తగూడెం మండలం రాఘవాపురం పెద్దవాగులో మంగళవారం స్కూల్బస్సు బోల్తాపడిన దుర్ఘటనలో మృతి చెందిన 8 మంది చిన్నారుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు. చనిపోయిన చిన్నారుల గ్రామాలకు వెళ్లేందుకు.... గురువారం ఆయన విజయవాడ నుంచి నేరుగా చండ్రుగొండ చేరుకుంటారు. అక్కడి నుంచి తిప్పనపల్లి, వెంకటాపురం, రేపల్లెవాడ, శ్రీరాంపురం, వెంగళరావునగర్, టేకుల బంజర, తుంగారం గ్రామాల్లో బాధిత కుటుంబాలను కలుసుకుంటారు. తర్వాత రాఘవాపురం వద్ద సంఘటన జరిగిన వాగు ప్రదేశాన్ని పరిశీలిస్తారు.
అక్కడినుంచి సుజాతనగర్ చేరుకొని కాసేపు విశ్రాంతి తీసుకున్నాక కొత్తగూడెం చేరుకుంటారు. కొత్తగూడెంలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసి వారిని పలుకరిస్తారు. అనంతరం అక్కడ నుంచి నేరుగా విజయవాడ బయలుదేరి వెళతారు. జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
అక్కడినుంచి సుజాతనగర్ చేరుకొని కాసేపు విశ్రాంతి తీసుకున్నాక కొత్తగూడెం చేరుకుంటారు. కొత్తగూడెంలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసి వారిని పలుకరిస్తారు. అనంతరం అక్కడ నుంచి నేరుగా విజయవాడ బయలుదేరి వెళతారు. జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
0 comments:
Post a Comment