మాట విననివారిపైకి సీబీఐ: అఖిలేష్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మాట విననివారిపైకి సీబీఐ: అఖిలేష్

మాట విననివారిపైకి సీబీఐ: అఖిలేష్

Written By news on Sunday, March 31, 2013 | 3/31/2013

యూపీఏ ప్రభుత్వం సీబీఐని దుర్వినియోగం చేస్తోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. తమ మాట విననివారు ఎవరైనా సీబీఐ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. యూపీఏ పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఆ కూటమి ఘోరంగా దెబ్బతినక తప్పదని చెప్పారు. శనివారమిక్కడ ఓ కార్యక్రమానికి హాజరైన అఖిలేష్.. మీడియాతో మాట్లాడారు. యూపీఏకు మద్దతు ఉపసంహరిస్తారా అని అడగ్గా.. మతతత్వ శక్తులను దూరంగా ఉంచేందుకు యూపీఏకు మద్దతు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాన్ని అనేక క్లిష్ట సమయాల్లో ఆదుకున్నానని, అయినా కాంగ్రెస్ తనపైకి సీబీఐని ఉసిగొల్సిందని ఎస్పీ అధినేత, తన తండ్రి ములాయంసింగ్ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించగా అఖిలేష్ నేరుగా సమాధానం ఇవ్వలేదు. ‘‘కాంగ్రెస్ మాట విననివారెవరైనా సీబీఐ విచారణ ఎదుర్కొంటారు..’’ అని అన్నారు. 
Share this article :

0 comments: