Home »
» జగన్ను కలిసిన టీడీపీ నేత బగ్గు లక్ష్మణ్రావు
జగన్ను కలిసిన టీడీపీ నేత బగ్గు లక్ష్మణ్రావు
శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట టీడీపీ మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణ్రావు మంగళవారం చంచల్గూడ జైల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో వెనుకబడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అవిశ్వాసం పెట్టాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఆ పార్టీతో కుమ్మక్కయ్యారని విమర్శించారు. చంద్రబాబు తీరుకు నిరసనగా తాను టీడీపీకి రాజీనామా చేసి బయటకు వ చ్చానన్నారు. జగన్తో కలిసి పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. లక్ష్మణ్రావు వెంట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు. జగన్ను కలిసిన వారిలో శ్రీకాకుళం మాజీ ఎంపీ పాల్వలస రాజశేఖర్ తనయుడు విక్రాంత్, ఖమ్మం జిల్లా నాయకుడు రామ సహాయం నరేష్రెడ్డి ఉన్నారు. జగన్ను కలిసిన అనంతరం ఎమ్మెల్యే కృష్ణదాస్తో కలిసి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్కు చేరుకొని నిరవధిక దీక్షలో ఉన్న విజయమ్మను కలిసి లక్ష్మణ్రావు సంఘీభావం ప్రకటించారు.
0 comments:
Post a Comment