పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 2010 నుంచి ఇప్పటిదాకా 20 సార్లు ధరలు పెంచారని వైఎస్ఆర్ సీపీ నేత జూపూడి ప్రభాకరరావు గుర్తు చేశారు. చమురు కంపెనీలకు కేంద్ర, రాష్ట్రాలు దాసోహమయ్యాయని అన్నారు. ప్రజలతో సంబంధంలేదన్నట్టుగా ఆయిల్ కంపెనీలు వ్యవహరిస్తున్నాయన్నారు. ఆనాడు వైఎస్సార్ తీసుకున్న నిర్ణయంలా పెరిగిన ధరలను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతన్నకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలన్నారు.
Home »
» ' పెంచిన ధరలను ప్రభుత్వమే భరించాలి'
' పెంచిన ధరలను ప్రభుత్వమే భరించాలి'
Written By news on Saturday, February 16, 2013 | 2/16/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment