నల్గొండ: చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఆయనకు పట్టిన గతే పడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల హెచ్చరించారు. నిడమానూరులో ఆమె రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు కూడా విద్యుత్ చార్జీలు పెంచి రైతులను ఇబ్బంది పెట్టారు. మోటార్లు లాక్కొచ్చి రైతులను జైల్లో పెట్టారు. అందుకే చంద్రబాబును రైతులు ఇంటికి పంపారు. మళ్లీ ఇప్పుడు కిరణ్ సర్కార్ కూడా రైతులను కష్టపెడుతోందన్నారు.
బాబుకు ఈ ప్రభుత్వాన్ని దించే బలముంది. అయినా ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నెత్తిన పెట్టుకుని కాపాడుతున్నారని విమర్శించారు. మీ వద్దకు వస్తే చంద్రబాబును నిలదీయండని ఆమె ప్రజలకు పిలుపు ఇచ్చారు. విద్యుత్ లేక పరిశ్రమలు మూతబడుతున్నాయన్నారు. జగన్ సీఎం అయితే రైతుల కష్టాలు తీరుతాయని భరోసా ఇచ్చారు. |
Home »
» Sharmila rachabanda in Nidamanuru
Sharmila rachabanda in Nidamanuru
Written By news on Friday, February 15, 2013 | 2/15/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment