'ప్రజలకష్టాలుచూస్తూ అవిశ్వాసంపెట్టని బాబు' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'ప్రజలకష్టాలుచూస్తూ అవిశ్వాసంపెట్టని బాబు'

'ప్రజలకష్టాలుచూస్తూ అవిశ్వాసంపెట్టని బాబు'

Written By news on Saturday, February 16, 2013 | 2/16/2013

పాదయాత్రలో ప్రజల కష్టాలు చూస్తూ కూడా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు అవిశ్వాసం పెట్టడంలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలు షర్మిల విమర్శించారు. మిర్యాలగూడ నియోజకవర్గం తుంగపాడులో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ ప్రభుత్వంపై ప్రజల్లో ఏ వర్గానికీ నమ్మకంలేదన్నారు. కేవలం టీడీపీ నేత చంద్రబాబుకే ఈ ప్రభుత్వంపై నమ్మకం ఉందన్నారు. సొంతమామకే వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన ఘనత చంద్రబాబుదని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీలు నీచ రాజకీయాలకు పాల్పడి జగనన్నను జైలులో పెట్టారన్నారు. త్వరలోనే జగనన్న బయటకు వస్తారని, రాజన్న రాజ్యం వస్తుందని ప్రజలకు ఆమె భరోసా ఇచ్చారు.
Share this article :

0 comments: