సాక్షి దినపత్రిక గుంటూరు కార్యాలయంపై టీడీపీ కార్యకర్తల దాడికి పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోగా జర్నలిస్టు సంఘం నాయకుడు దేవులపల్లి అమర్పై ఆ పార్టీ నేతలు బురదజల్లడం బాధ్యతారాహిత్యమని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (ఏపీయూడబ్ల్యూజే) మండిపడింది. తెలుగుదేశం నేతల వైఖరి దురుద్దేశపూర్వకంగా ఉందని సంఘం అధ్యక్షుడు సోమసుందర్, ప్రధాన కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. తన పదవికి రాజీనామా చేయాలని అమర్ను టీడీపీ నేతలు కోరడం అర్థరహితమన్నారు. మీడియా సంస్థలు, పాత్రికేయులపై ఎక్కడ, ఎప్పుడు దాడులు జరిగినా వాటిని ఖండించడం, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరడం జర్నలిస్టు సంఘంగా తమ బాధ్యతన్నారు. అందులో భాగంగానే గుంటూరు సంఘటనను కూడా ఏపీయూడబ్ల్యూజే ఖండించిందని, ఇండియన్ జర్నలిస్టుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న అమర్ కూడా తమతోపాటే స్పందించారని తెలిపారు. ఇందుకు తెలుగుదేశం నేతలు పెడర్థాలు తీయడం, ఆయనను వై.ఎస్. జగన్ ఏజెంటుగా పేర్కొనడం వారి రాజకీయ దురుద్దేశాన్ని వెల్లడిస్తోందని మండిపడ్డారు.
Home »
» పశ్చాత్తాపం లేకపోగా బురదజల్లుతారా?
పశ్చాత్తాపం లేకపోగా బురదజల్లుతారా?
Written By news on Friday, February 15, 2013 | 2/15/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment