Home »
» రుద్రనేత్రునిగా బయటికొస్తాడు
రుద్రనేత్రునిగా బయటికొస్తాడు
వారి దృష్టిలో విలువలు గాలికొదిలేసిన మాటలు. ఈమాట ఎవరి గురించంటే - నిస్సిగ్గుగా స్వార్థ రాజకీయాలతో కుమ్మక్కవుతున్న చంద్రబాబు గురించి. పచ్చ పత్రికల వెకిలిరాతల గురించి. బ్లాక్ మెయిల్ చీకటి పురాణాలు ప్రసారం చేసే ఛానెళ్ల గురించి. నచ్చని వారిపై కక్ష సాధించే అధిష్టానం గురించి. అధికారం అండ చూసుకుని అహంకారంతో న్యాయాన్ని సైతం తొక్కిపెట్టిన ‘కాంగ్రెస్’ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గురించి. యూపీఏ పాలనలో ప్రపంచ స్థాయిలో అవినీతికి పేరుపడ్డ కేసు... స్పెక్ట్రం కుంభకోణం. రాజా నుండి కనిమొళి వరకు. కల్మాడి నుండి మహారాష్ట్ర ముఖ్యమంత్రి వరకు లక్షల కోట్ల కుంభకోణాలు. ఇందులో కాంగ్రెస్తో పాటు యూపిఏ భాగస్వామ్యపార్టీల నేతలే కీలకం. కేసులు నమోదయ్యా యి. అరెస్టులయ్యాయి. జైలుకెళ్లారు. కానీ వారికి ఆరునెలలు తిరక్కుండానే బెయిళ్లొచ్చాయి. ఆరునెలలు తిరక్కుండానే చార్జిషీట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు ఆ కేసుల ఊసే లేదు. ఇదంతా అయినవారికి. మరి కానివారికి? మాట విననివారికి? చూస్తూనే ఉన్నాం కదా. జగన్ని ఎంత వేధిస్తున్నారో! ఆయన అభిమానులను ఎంత మనస్తాపానికి గురిచేస్తున్నారో! ఏం పర్వాలేదు. జగన్ ప్రజామోదం పొందిన శక్తిగా, కుమ్మక్కు రాజకీయాలను చీల్చిచెండాడే రుద్రనేత్రుడిగా బయటికి వస్తాడు. రాష్ట్రప్రజలకు బహుమతిగా రామరాజ్యాన్ని ఇస్తాడు. అప్పుడు ఈ నక్కలన్నీ తోక ముడవాల్సిందే!. - ముడియం మోహన్రెడ్డి, వ్యాపారి, వలసరవాక్కం, చెన్నై
|
|
0 comments:
Post a Comment