'సీబీఐ కేంద్రం చేతిలో కీలుబొమ్మ' అనే విషయం మరోసారి స్పష్టమైందని వైఎస్ షర్మిల అన్నారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె గురువారం తెనాలిలో మాట్లాడుతూ సాక్షాత్తూ సీబీఐ మాజీ డైరక్టర్ జోగిందర్ సింగే ఈ వ్యాఖ్యలు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
యూపీఏకు మద్దతు విరమించిన మరుసటి రోజే.. డీఎంకే నేత స్టాలిన్ ఇంట్లో సీబీఐ సోదాలు జరపటం... నిరసనలు వెల్లువెత్తటంతో కేంద్రం ఒక కనుసైగ చేయటంతో సోదాలు ఆపేసిందని షర్మిల విమర్శించారు. కాగా షర్మిల పాదయాత్రలో వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలను ఆమె విన్నారు
యూపీఏకు మద్దతు విరమించిన మరుసటి రోజే.. డీఎంకే నేత స్టాలిన్ ఇంట్లో సీబీఐ సోదాలు జరపటం... నిరసనలు వెల్లువెత్తటంతో కేంద్రం ఒక కనుసైగ చేయటంతో సోదాలు ఆపేసిందని షర్మిల విమర్శించారు. కాగా షర్మిల పాదయాత్రలో వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలను ఆమె విన్నారు
0 comments:
Post a Comment