ధరలన్నీ పెరిగిపోతుంటే.. ఎలా బతికేది? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ధరలన్నీ పెరిగిపోతుంటే.. ఎలా బతికేది?

ధరలన్నీ పెరిగిపోతుంటే.. ఎలా బతికేది?

Written By news on Thursday, May 23, 2013 | 5/23/2013

* దిగుబడి రావట్లేదు.. మద్దతు ధర పెరగడం లేదు
* వచ్చిన దిగుబడి కౌలుకే సరిపోతుంది
* ధరలన్నీ పెరిగిపోతుంటే.. ఎలా బతికేది?
* త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని, కష్టాలన్నీ తీరుతాయని ధైర్యం చెప్పిన షర్మిల
* రోడ్డు పక్కన గుడిసెల్లో బతుకుతున్నవారి కష్టాలు చూసి చలించిన నేత

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘ఎంత కష్టపడినా అప్పులే మిగులుతున్నాయమ్మా. వరి పంట వేసి నష్టపోతున్నాం. నీళ్లు లేక దిగుబడి తగ్గిపోతోంది. పండిన ధాన్యానికి మద్దతు ధరా ఇయ్యట్లేదు. నాన్నగారున్నప్పుడు అందరికీ ఉపకారం జరిగింది. ఇప్పుడు అందరూ ఉసూరుమంటున్నారు’’ అంటూ పలువురు రైతులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాకంటక పాలనకు, దానికి వంతపాడుతున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర బుధవారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో సాగింది.

పెంటపాడు మండలం యానాలపల్లిలో షర్మిలకు రైతులు తమ బాధలు చెప్పుకున్నారు. ఎకరం పొలం సాగు చేయడానికి రూ.22 వేలు ఖర్చవుతుందని, కానీ తమకు ఏమీ మిగలడం లేదని, అప్పులే మిగులుతున్నాయని వాపోయారు. వారి బాధలు విన్న షర్మిల దిగుబడి ఎంత తగ్గుతుందన్నా అని ప్రశ్నించారు. 20, 25 బస్తాలు మాత్రమే వస్తున్నాయని, అవి కౌలుకు ఇవ్వడానికే సరిపోవడం లేదని రైతు గిద్దా తాతారావు వివరించాడు. మామూలుగా ఎంత దిగుబడి వస్తుందని అడగ్గా 40 బస్తాలు వస్తుందని చెప్పాడు.

పండిన ధాన్యానికి మద్దతు ధర రావడంలేదని, ఎరువులు, పురుగుమందులతోపాటు అన్నింటి ధరలూ పెరుగుతున్నా మద్దతు ధర పెరగడంలేదని మరో రైతు తాడి గోపాలకృష్ణ వాపోయాడు. ఎరువుల ధరలు రెండింతలు పెరిగాయని ఆవేదన వ్యక్తంచేశాడు. కౌలు ఎంత ఇవ్వాలన్నా అని షర్మిల ప్రశ్నించడంతో దాళ్వాకు 15, సార్వాకు 15 బస్తాలు మొత్తం కలిపి 30 బస్తాలు ఇవ్వాలని, వచ్చేది కౌలుకే సరిపోతుందని మాదాసు కనకయ్య చెప్పాడు. గతేడాది నీలం తుపానుకు పంటంతా పోయిందని, ఇప్పటివరకూ పరిహారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశాడు. త్వరలోనే ఈ కష్టాలన్నీ తీరుతాయని, మళ్లీ రాబోయే రాజన్న రాజ్యంలో రైతుల కష్టాలు తీర్చేందుకు జగనన్న ప్రత్యేక చర్యలు తీసుకుంటారని షర్మిల వారికి భరోసా ఇచ్చారు.

ఏళ్లయినా స్థలాలివ్వడంలేదు
ఇదే మండలంలోని పరిమెళ్ల ఎరుకల కాలనీ మీదుగా షర్మిల వెళ్లినప్పుడు అక్కడి గడిసెవాసులు షర్మిల వద్దకొచ్చి తమ సమస్యలు చెప్పుకొన్నారు. ‘ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్డు పక్కన ఈ గుడిసెల్లోనే ఉంటున్నాం. గుడిసెల్లోంచి బయటకు వస్తే మా పిల్లలు కార్లు, ఆటోల కింద పడతారేమోనని బిక్కుబిక్కుమంటూ ఉంటున్నాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రాజశేఖరరెడ్డిగారు ఇక్కడే ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి భూమి కూడా కొన్నారని, ఆయన చనిపోవడంతో తమ ను ఎవరూ పట్టించుకోవడంలేదని నక్కా పెద్దిరాజు, చిన్నవెంకమ్మ వాపోయారు. ‘‘జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలందరికీ ఇళ్లు వస్తాయన్నా.. ధైర్యంగా ఉండండి’’ అని షర్మిల వారికి భరోసా ఇచ్చి ముందుకు కదిలారు.

బల్బు, ఫ్యానుకు 1,700 కరెంటు బిల్లు
ఆ పక్కనే ఉన్న గుడిసెలోని నక్కా ధనపండు, అతని భార్య అంజమ్మలు తమకు వచ్చిన కరెంటు బిల్లులను తీసుకువచ్చి షర్మిలకు చూపించారు. తమ గుడిసెలో ఒక బల్బు, ఒక ఫ్యాను మాత్రమే ఉన్నాయని, కానీ బిల్లు ఇంత వచ్చింది చూడండమ్మా అన్ని చూపించారు. ఒక నెల రూ.1,200, మరో నెల రూ. 1,700 బిల్లులు వచ్చాయి.

రెండు నెలలు కలిపి రూ. మూడు వేల దాకా బిల్లు వచ్చిందని చూపిస్తూ ఇంత సొమ్మును తాము ఎలా కట్టాలో తెలియడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత పరిమెళ్లలో జరిగిన రచ్చబండలో మహిళలు తమకు ఇళ్లు లేవని షర్మిల ఎదుట తమ గోడు వినిపించారు. ఒకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు కలిసి ఉంటున్నామని, తమకు ఇళ్లు ఇవ్వడం లేదని చెప్పారు. అస్సలు కరెంటు ఉండడంలేదని, కానీ బిల్లులు మాత్రం రూ.వేలల్లో వస్తున్నాయని పలువురు మహిళలు ఆవేదనతో చెప్పారు. దీనిపై స్పందించిన షర్మిల 24 గంటలకు ఎన్ని గంటలు కరెంటు ఉంటుందమ్మా అని ప్రశ్నించడంతో మూడు, నాలుగ్గంటలు మించి ఉండడంలేదని మహిళలు ముక్తకంఠంతో చెప్పారు. ‘‘త్వరలోనే మళ్లీ రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు అందరి కష్టాలూ తీరుతాయి. జగనన్నను ఆశీర్వదించండి’’ అని షర్మిల అన్నారు.

9.8 కిలోమీటర్ల యాత్ర
‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 156వ రోజు బుధవారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శివారులో ప్రారంభమైంది. అక్కడి నుంచి పెంటపాడు, కే పెంటపాడు, యానాలపల్లి మీదుగా పరిమెళ్ల చేరుకున్నారు. ఇక్కడ రచ్చబండ నిర్వహించిన అనంతరం ఉంగుటూరు నియోజకవర్గంలోని జె.కొమ్మర గ్రామం వరకు యాత్ర చేశారు. ఆ గ్రామసమీపంలో ఏర్పాటుచేసిన బస కేంద్రానికి షర్మిల రాత్రి 7.35 నిమిషాలకు చేరుకున్నారు. బుధవారం మొత్తం 9.8 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్రలో ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, స్థానిక నేతలు తోట గోపి, మొవ్వ ఆనంద్ శ్రీనివాస్, గంటా ప్రసాద్, పాశం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నాలుగడుగుల గుడిసెలో... లేవలేని స్థితిలో...
పశ్చిమ గోదావరి జిల్లాలో పరిమెళ్ల ఎరుకల కాలనీ మీదుగా సాగుతున్నప్పుడు అక్కడ ఓ వృద్ధుడి దీని స్థితి షర్మిలను కలచివేసింది. రోడ్డు పక్కన నాలుగడుగుల గుడిసెలో, లేవలేని స్థితిలో జీవచ్ఛవంలా పడి ఉన్న గాదె నరసింహుల్ని చూసి షర్మిల చలించిపోయారు. గుడిసెలోకి వెళ్లి పలకరిద్దామని ఆమె యత్నించినప్పటికీ.. అంత చోటు కూడా లేకపోవడంతో బయట నుంచే అతడికి ధైర్యం చెప్పారు. ఉండడానికి ఇల్లు లేక, ఆర్థిక ఇబ్బందులతో బతుకే భారంగా ఇలా రోడ్డు పక్కన గుడిసెల్లో కాలం వెళ్లదీస్తున్నామని ఆయన భార్య పెద్దింట్లు.. షర్మిల వద్ద కన్నీళ్ల పర్యంతమైంది. ఉన్న ఒక్క కొడుకూ చనిపోయాడని, ఇద్దరు కూతుళ్లూ పెళ్లిళ్లు అయ్యి వెళ్లిపోయారని, తమను చూసే వారే లేరని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. తమ కోడలు, ముగ్గురు పిల్లలతో పక్కన మరో చిన్న గుడిసెలో ఉంటున్నట్లు ఆమె తెలిపింది. ‘‘మళ్లీ మంచి రోజులొస్తాయమ్మా.. అందరి కష్టాలు తీరతాయి’’ అని ధైర్యం చెప్పి బరువెక్కిన హృదయంతో షర్మిల ముందుకు సాగా
- See more at: http://www.sakshi.com/main/FullStory.aspx?catid=603957&Categoryid=1&subcatid=33#sthash.qy4cOE9B.dpuf
Share this article :

0 comments: