వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మంగళవారం ఉదయం కాగజ్ నగర్ చేరుకున్నారు. కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ లో ఆమెకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. విజయమ్మ వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ ఉన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ సందర్శనకు విజయమ్మ హైదరాబాద్ నుంచి ఏపీ ఎక్స్ప్రెస్ లో బయల్దేరారు. ఆమె11.15 గంటలకు కాగజ్నగర్ చేరుకున్నారు. అంతకు ముందు ఆమెకు కాజీపేటలో పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.
కాగజ్ నగర్ నుంచి విజయమ్మ రోడ్డు మార్గం గుండా కౌటాల మండలం తుమ్మిడిహెట్టికి వెళ్తారు. మార్గమధ్యంలోని సిర్పూర్(టి)లో వైఎస్సార్ సీపీ జెండా ఆవి ష్కరణ, టొంకిని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు, కౌటాల మండలం ముత్తం పేట గ్రామంలో వైఎస్సార్ సీపీ జెండా ఆవిష్కరణ, కౌటాల మండల కేంద్రంలో జెండావిష్కరణ చేస్తారు. తుమ్మిడిహెట్టిలోని ప్రాణహిత-చేవెళ్ల ప్రాజె క్టు శిలాఫలకానికి క్షీరాభిషేకం అనంతరం అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తా రు. ప్రాణహిత నదిలో పడవలో ప్రయాణిం చి పరిశీలిస్తారు.కాగజ్నగర్ పట్టణంలోని ఎస్పీఎం గ్రౌండ్లో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే బహిరంగసభలో ప్రసంగించనున్నారు. అనంతరం హైదరాబాద్కు బయలుదేరుతారు. |
Home »
» కాగజ్ నగర్ చేరుకున్న విజయమ్మ
కాగజ్ నగర్ చేరుకున్న విజయమ్మ
Written By news on Tuesday, May 21, 2013 | 5/21/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment