వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పులివెందులలో పర్యటించారు. వైఎస్ఆర్ తండ్రి వైఎస్ రాజారెడ్డి పదిహేనో వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించారు. రాజారెడ్డి పార్కులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైఎస్ వివేకానందరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి చర్చిలో విజయమ్మ ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.
అనంతరం వైఎస్ఆర్ సీపీ నేత వరప్రసాద్ సోదరుని కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. జగన్ను అక్రమంగా అరెస్ట్ చేసి ఏడాది అవుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ సీపీ డాక్టర్స్ సెల్ కన్వీనర్ శివభరత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాల పోస్టర్లను విజయమ్మ విడుదల చేశారు.
అనంతరం వైఎస్ఆర్ సీపీ నేత వరప్రసాద్ సోదరుని కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. జగన్ను అక్రమంగా అరెస్ట్ చేసి ఏడాది అవుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ సీపీ డాక్టర్స్ సెల్ కన్వీనర్ శివభరత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాల పోస్టర్లను విజయమ్మ విడుదల చేశారు.
0 comments:
Post a Comment