నిన్నటి సమావేశంలో కాంగ్రెస్ నేతలు, సీఎం సొంత డబ్బా బాగా మోగించుకున్నారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. ప్రధాన ప్రతిపక్షాన్ని ఒక్కమాట అనలేదని, ప్రజాపక్షంగా ఉన్న వైఎస్ఆర్ సీపీపై మాత్రం పనిగట్టుకుని విమర్శలు చేశారని తెలిపారు. వైఎస్ఆర్ రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తూ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
వందశాతం ఎల్లో మీడియా చంద్రబాబు భజన చేస్తోందని, వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకే సాక్షి పత్రిక పుట్టిందని తెలిపారు. 4 ఏళ్లలో సీఎం, బొత్సలకు వార్తా చానళ్లు కొనేంత డబ్బులు ఎలా వచ్చాయని బాబు ఎందుకు అడగడంలేదని ప్రశ్నించారు. జగన్ను ఆర్థిక ఉగ్రవాది అన్న మంత్రి ఆనమే మానసిక ఉన్మాది అని గట్టు దుయ్యబట్టారు. వైఎస్ హయాంలో ఆనం సోదరులు పిల్లుల్లాగా తిరిగారని గుర్తు చేశారు. సీఎం మారితే పదవి కోసం కిరణ్ను అంతకన్నా హీనంగా తిట్టగల ఆనం రామనారాయణరెడ్డిది నాలుక కాదు తాటిమట్ట అన్నారు. ఎన్డీఏ మీద ఒత్తిడి పెంచి రూ.500, రూ.1000 నోట్లను తెచ్చిందే చంద్రబాబు అని గుర్తు చేశారు. స్టాంపు కుంభకోణం, దొంగనోట్ల ముద్రణలో టీడీపీ వారే అరెస్టయ్యారని అన్నారు. ఎన్నికల సమయంలో కోట్లాది రూపాయలు టీడీపీ నేతల నుంచే రికవరీ అయ్యాయని అన్నారు. అలాంటి చంద్రబాబు రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయాలంటే జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న బాబు, లోకేష్, ఆనం నాలుక కోయాలన్న కోపంలో ప్రజలున్నారని గట్టు రామచంద్రరావు చెప్పారు. |
Home »
» పెద్ద నోట్లు తెచ్చిందే చంద్రబాబు: గట్టు
పెద్ద నోట్లు తెచ్చిందే చంద్రబాబు: గట్టు
Written By news on Thursday, May 23, 2013 | 5/23/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment