వైఎస్ఆర్ ఫౌండేషన్ కు ఎన్నారై 57 లక్షల విరాళం! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ ఫౌండేషన్ కు ఎన్నారై 57 లక్షల విరాళం!

వైఎస్ఆర్ ఫౌండేషన్ కు ఎన్నారై 57 లక్షల విరాళం!

Written By news on Friday, June 7, 2013 | 6/07/2013

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఫౌండేషన్‌కు అమెరికాకు చెందిన ఎన్నారై డా.ప్రేమ్‌సాగర్‌రెడ్డి రూ.57లక్షలను విరాళంగా అందజేశారు. ఇందుకు సంబంధించిన చెక్‌ను ఆయన బంధువు పి.సుగుణాకర్‌రెడ్డి శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయమ్మకు అందజేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన పేద ప్రజల కోసం అమలు పరిచిన సంక్షేమ కార్యక్రమాలకు స్పందించి ప్రేమ్‌సాగర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం నిర్వాహణకు గతంలో రూ.25లక్షల విరాళాన్ని అందజేశారు. రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన ఆశయాల్ని నెరవేర్చే దిశగా అమెరికాలోని పలు ప్రాంతాల్లో కూడా వైఎస్సార్ ఫౌండేషన్ తరఫున ప్రేమ్‌సాగర్ పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విజయమ్మకు చెక్ అందజేసిన వారిలో సుగుణాకర్‌రెడ్డితో పాటు వైఎస్సార్‌సీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, జి.కరీం, టి.పూర్ణం, శ్రీకాంత్‌లు ఉన్నారు. 
Share this article :

0 comments: