వై.ఎస్. కుటుంబంలో ప్రతి ఒక్కరికీ...ప్రజాభిమానం, పాలనాదక్షత - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వై.ఎస్. కుటుంబంలో ప్రతి ఒక్కరికీ...ప్రజాభిమానం, పాలనాదక్షత

వై.ఎస్. కుటుంబంలో ప్రతి ఒక్కరికీ...ప్రజాభిమానం, పాలనాదక్షత

Written By news on Monday, June 3, 2013 | 6/03/2013


వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డికి ఇంతవరకు బెయిల్ ఇవ్వకుండా రాజకీయంగా అణగదొక్కుతూ ఆ కుటుంబాన్ని వీధుల పాలు చేసిన కాంగ్రెస్ అధిష్టానం వెనుక... మన ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉన్నారనీ, తన మాతృసంస్థ అయిన కాంగ్రెసుతో ఆయన కుమ్మక్కయ్యారనీ స్పష్టంగా కనిపిస్తోంది. అనుక్షణం ప్రజాసంక్షేమం కోసమే పాటుపడవలసిన ‘ప్రతి’ నాయకుడు... ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని కూడా లేకుండా నిత్యం వై.ఎస్. కుటుంబంపై బురద జల్లుతూనే ఉన్నారు. జగన్మోహన్‌రెడ్డి మద్దతును కూడా కూడగట్టుకుని కాంగ్రెస్‌కు దీటైన ప్రతిపక్షంగా నిలబడాల్సింది పోయి, ఆయన మీద లేని పోని అభాండాలు వేస్తున్నారు. కేంద్రంలో భారీఎత్తున అవినీతి కుంభకోణాలు జరిగితే వాటి మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపటికీ జగన్ నామజపమే చేస్తున్నారు!

విజయమ్మగారు నిన్నమొన్నటి వరకు ఇంటికే పరిమితమైన గృహిణి. ఇప్పుడు ఆమె ప్రజాసంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే ఆమెను కూడా ఈ కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు విమర్శించడం సంస్కారహీనం. ఎండల్ని, ఆరోగ్యాన్ని లెక్క చేయక వేలకిలోమీటర్ల ‘మరో ప్రజాప్రస్థాన’ పాదయాత్ర చేస్తున్న షర్మిలమ్మను అభినందించాల్సింది పోయి ఆమెపైన కూడా విమర్శలు కురిపిస్తున్నారు. ప్రపంచ చరిత్రలోనే ఏ ఆడపిల్లా ప్రజా సమస్యల్ని తెలుసుకోవడం కోసం ఇంత దూరం పాదయాత్ర చేయలేదన్నది మనమంతా గుర్తుంచుకోవాలి. ప్రజల దగ్గరకు వెళ్లి ప్రజల బాధలను ఎవరైతే అర్థం చేసుకుంటారో వారే పరిపాలనా దక్షులు అవుతారు. ఆ దక్షత వై.ఎస్. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఉంది. అధికార, ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు, ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు జగన్ వైపే ఉన్నారు. సరైన సమయంలో తమ అభిమానాన్ని వారు చాటుకుంటారు.

- సన్నారెడ్డి జయచంద్రారెడ్డి, సాగునీటి సంఘం అధ్యక్షులు యల్లశిరి గ్రామం, చిట్టమూరు మండలం, నెల్లూరు
Share this article :

0 comments: