స్థానిక సంస్థల ఎన్నికలను సవాల్ గా తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పార్టీ నేతలు, శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఆమె శనివారం లోటస్ పాండ్ లో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో ప్రతి ప్రజా సమస్యపై వైఎస్ఆర్సీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజా సమస్యలపై ప్రధానంగా దృష్టి పెట్టలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేయలని విజయమ్మ పార్టీ నేతలకు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో ప్రతి ప్రజా సమస్యపై వైఎస్ఆర్సీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజా సమస్యలపై ప్రధానంగా దృష్టి పెట్టలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేయలని విజయమ్మ పార్టీ నేతలకు సూచనలు చేశారు.
ఆంధ్రా ప్రాంత రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా కన్వీనర్లు, పార్లమెంట్ అబ్జర్వర్లు, అసెంబ్లీ కో ఆర్డినేటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. రేపు, ఎల్లుండి తెలంగాణ, రాయలసీమ ప్రాంత నేతలతో విజయమ్మ సమీక్ష నిర్వహిస్తారు.
|
0 comments:
Post a Comment