వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 7న కోర్టుకు హాజరుకానున్నారు. తన కంపెనీల్లో పెట్టుబడులు అక్రమమంటూ సీబీఐ దాఖలు చేసిన ఐదో చార్జిషీట్ను కోర్టు పరిగణనలోకి తీసుకుంటున్న నేపథ్యంలో ఆయనను తన ముందు హాజరుపరచాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ఆయనను కోర్టుకు హాజరుపరచనున్నారు.ఆయనతో పాటు క్విడ్ ప్రో కో కేసును ఎదుర్కొంటున్న ఇతర నిందితులూ కోర్టుకు హాజరవుతారు. చివరిసారిగా జగన్ డిసెంబర్ 5న కోర్టుకు వచ్చారు. సరిగ్గా ఆరు నెలల తర్వాత ఇప్పుడు శుక్రవారం ఆయన జైలు నుంచి బయట ప్రపంచానికి రానున్నారు.
సీబీఐ కక్ష సాధిస్తోంది: చెవిరెడ్డి
జగన్కు అండగా ఉన్నవారిని అణచివేసేందుకు సీబీఐ కుట్రపూరితంగా వ్యవహరిస్తూ కక్ష సాధిస్తోందని వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డితోపాటు కోర్టుకు వచ్చిన భాస్కర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. కుమార్తె కాళ్ల పారాణి ఆరకముందే సాయిరెడ్డి జైలుకు వెళ్లాల్సిరావడం ఆయన కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసిందని వాపోయారు.
0 comments:
Post a Comment