జగన్ నిర్బంధం రాజకీయ కుట్రే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ నిర్బంధం రాజకీయ కుట్రే

జగన్ నిర్బంధం రాజకీయ కుట్రే

Written By news on Monday, June 3, 2013 | 6/03/2013


సాక్షి, నెల్లూరు: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్బంధం ముమ్మాటికీ రాజకీయకుట్రేనని న్యాయవాదులు, మేధావులు, సామాజికవేత్తలు అన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మ క్కై సీబీఐని అడ్డుపెట్టుకుని ఆయన్ను జైలులో పెట్టించాయని ధ్వజమెత్తారు. న్యాయవ్యవస్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు తమకు అనుకూలంగా మార్చుకుని ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్ట ని హెచ్చరించారు. ఈ పరిణామాలతో న్యాయవ్యవస్థ తీరుతెన్నులపై దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు సైతం చర్చించుకుంటున్నారని, దీనిని కోర్టులు సైతం గమనిస్తున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. నెల్లూరులోని హరిత హోటల్‌లో ఆదివారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో చైతన్యపథం కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి కార్యాలయ విశ్రాంత ఉద్యోగి రామ్మూర్తి మాట్లాడుతూ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్దోషి అని, ఆయనపై గాని, విజయసాయిరెడ్డిపైగాని ఎలాంటి కేసు లేదన్నారు. క్విడ్ ప్రోకో అంటే పరస్పర సహకారమని, జగన్‌కు ఈజీఓలు, లావాదేవీ లతో ఏ సంబంధం లేదన్నారు. ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థపై గౌరవం ఉంటే సెప్టెంబర్ 5న జగన్‌కు బెయిల్ ఇవ్వాలన్నారు. ఒక్క కాంగ్రెస్‌కేగాక ప్రతిపక్షపార్టీ అయిన టీడీపీతో కూడా సీబీఐ కుమ్మక్కై జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో నుంచి బయటకు రానీకుండా కుట్రలు పన్నుతున్నాయని కొమరిక గ్రామానికి చెందిన రైతు గూడూరు ప్రభాకరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్ అనేది ఓ నైతిక హక్కు అని, దానిని కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోందని న్యాయవాది బసిరెడ్డి నారాయణరెడ్డి విమర్శించారు. 

జగన్ కేసులో అన్నీ ప్రశ్నలే తప్ప సమాధానాలు లేవని న్యాయవాది సత్యనారాయణ అన్నారు. మాయావతి, ములాయంసింగ్‌లపై అనేక కేసులు ఉన్నాయి, కాంగ్రెస్ నేతలు పలు కుంభకోణాల్లో కీలకంగా ఉన్నారు. వీరివిషయంలో సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయడం లేదని డాక్డర్ ఏవీఎస్‌రెడ్డి విమర్శిం చారు. ప్రజలగుండెల్లో ఉన్న వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ కష్టాలకు గురిచేయడం దారుణమని, కక్షసాధింపు చర్యేనని రాధికారెడ్డి విమర్శించా రు.దోషా, నిర్దోషా అనేది తేల్చకుండా ఏడాదిగా జైలులో బంధించి, వేధిం చడం దారుణమని సాహితీవేత్త మెట్టు రామచంద్రప్రసాద్ విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లోపెట్టి వేధించడం రాజకీయ కుట్రఅని అందరికీ అర్థం అవుతోందని న్యాయవాది గోవిందరాజుల సుభద్రాదేవి అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చిన ఈ కార్యక్రమానికి స్వప్న వ్యాఖ్యాతగా వ్యవ హరించారు.
Share this article :

0 comments: