Home »
» వైఎస్ఆర్ సీపీలోకి 10 వేల మంది టీడీపీ కార్యకర్తలు
వైఎస్ఆర్ సీపీలోకి 10 వేల మంది టీడీపీ కార్యకర్తలు
విజయనగరం జిల్లా బలిజిపేట మండలంలోని 20 పంచాయతీల నుంచి 10 వేల మందికి పైగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం వైఎస్ఆర్ సీపీలో చేరారు. మాజీ ఎంపీపీ సంబాన సత్యంనాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు పెనుమత్స సత్యనారాయణరాజులకు వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు, ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుజయ్ కృష్ణరంగారావు పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి పాదయాత్ర ముగింపు సభ విశాఖలో జరుగుతున్న తరుణంలోనే వీరు చేరడం గమనార్హం
0 comments:
Post a Comment