Home »
» స్పందన లేని ప్రభుత్వమిది: విజయమ్మ
స్పందన లేని ప్రభుత్వమిది: విజయమ్మ
ఎన్టీఆర్ నగర్: ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్ని ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం స్పందించడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విమర్శించారు. అన్ని రంగాల్లో కిరణ్ సర్కారు విఫలమయిందన్నారు. సర్ చార్జీల పేరుతో సామాన్యులపై మోయలేని భారం మోపిందన్నారు. వైఎస్ఆర్ ఇచ్చిన హామీలను ప్రస్తుత ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణాపురం డివిజన్లో ఎన్టీఆర్నగర్ ఇళ్లను రెగ్యులరైజ్ చేయాలని స్థానిక కార్పొరేటర్ దేప సురేఖా భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన మూడురోజుల నిరాహారదీక్షను విజయమ్మ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గుడిసెలేని రాష్ట్రం కోసం వైఎస్సార్ కృషి చేశారన్నారు. దీనిలో భాగంగా 80 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టారని, 47 లక్షల ఇళ్లు పూర్తి చేశారని గుర్తు చేశారు. ఎన్టీఆర్నగర్ ఇళ్లను రెగ్యులరైజ్ చేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామన్నారు. ఏ సమస్య వచ్చినా వైఎస్సార్ పార్టీ ప్రజల వెంట ఉంటుందన్నారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకుంటే తాము అధికారంలోకి వచ్చాక ఇళ్లను రెగ్యులరైజ్ చేస్తామని విజయమ్మ హామీయిచ్చారు.
|
|
0 comments:
Post a Comment