మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి వ్యాఖ్యలపై వైఎస్ఆర్ సీపీ సీరియస్ అయింది. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మంత్రి ఆనంకు వైఎస్ఆర్ సీపీ ఉపాధ్యక్షుడు శివకుమార్ నోటీసులు జారీ చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మంత్రి ఆనం వ్యాఖ్యలు చేశారని శివకుమార్ నోటీసులో పేర్కొన్నారు. పార్టీని, వైఎస్ కుటుంబాన్ని కించపరిచే విధంగా ఆనం మాట్లాడారన్నారు. ఆనంను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని శివకుమార్ డిమాండ్ చేశారు.
కోర్టులో అంశం ఉండగా జగనే నేరస్తుడిగా ఆనం ఎలా మాట్లాడతారని ఆయన ప్రశ్నించారు. వైఎస్ ఉన్నప్పుడు వైఎస్ కాలు మొక్కి ఆయన చుట్టు తిరిగిన మంత్రి ఆనం గురించి ప్రజలందరికీ తెలుసన్నారు. వైఎస్ ఉన్నప్పుడు ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడుతున్న ఆనంను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఆనం వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకపోతే జరిగే పరిణామాలకు మంత్రి ఆనందే బాధ్యత వహించాలని శివకుమార్, జనక్ప్రసాద్లు హెచ్చరించారు. |
Home »
» మంత్రి ఆనంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నోటీసులు
మంత్రి ఆనంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నోటీసులు
Written By news on Sunday, April 28, 2013 | 4/28/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment