ముచ్చర్ల: బయ్యారం గనులపై టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నా కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తున్నాయి అని ఖమ్మం జిల్లా ముచ్చర్ల ఏర్పాటు సభలో షర్మిల అన్నారు. గనులను ఏపీఎండీసీకి ఆనాడు వైఎస్ఆర్ కేటాయించారని షర్మిల తెలిపారు. మైనింగ్ చేసి.. రక్షణ స్టీల్స్కి ఖనిజాన్ని ఏపీఎండీసీకి మాత్రమే విక్రయించేలా హక్కులు కల్పించారని షర్మిల అన్నారు.
ఈ ప్రాంతంలో రక్షణ స్టీల్స్ కర్మాగారాన్ని ఏర్పాటుచేసి గిరిజనులకు ఉపాధి కల్పించాలని వైఎస్ ఆశించారు..కానీ ఇప్పటి సీఎం కిరణ్ ఇక్కడి గనులను విశాఖకు కేటాయించడం ఎంతవరకు న్యాయమని ఆమె ప్రశ్నించారు. వెనుకబడ్డ ఈ గిరిజన ప్రాంతంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న వైఎస్ ఆశయాన్ని జగనన్న నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ నెరవేరుస్తుందని షర్మిల తెలిపారు.
వైఎస్ఆర్ తన పాదయాత్రలో ప్రజల కష్టాలను చూసి తల్లడిల్లిపోతే.. తనయాత్రలో చంద్రబాబు ..తన బాధలను చూసి తానే తల్లడిల్లిపోయారని విమర్శించారు. కనీసం పాదయాత్ర ముగింపు తర్వాత అయినా చంద్రబాబు మనిషిగా మారాడన్నది సందేహమేనని ఆమె ఎద్దేవా చేశారు. మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకి ఈ జన్మలో మార్పు రాదని, టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కుట్రలు ఎక్కువరోజులు సాగవని ముచ్చర్ల సభలో షర్మిల అన్నారు.
ఈ ప్రాంతంలో రక్షణ స్టీల్స్ కర్మాగారాన్ని ఏర్పాటుచేసి గిరిజనులకు ఉపాధి కల్పించాలని వైఎస్ ఆశించారు..కానీ ఇప్పటి సీఎం కిరణ్ ఇక్కడి గనులను విశాఖకు కేటాయించడం ఎంతవరకు న్యాయమని ఆమె ప్రశ్నించారు. వెనుకబడ్డ ఈ గిరిజన ప్రాంతంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న వైఎస్ ఆశయాన్ని జగనన్న నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ నెరవేరుస్తుందని షర్మిల తెలిపారు.
వైఎస్ఆర్ తన పాదయాత్రలో ప్రజల కష్టాలను చూసి తల్లడిల్లిపోతే.. తనయాత్రలో చంద్రబాబు ..తన బాధలను చూసి తానే తల్లడిల్లిపోయారని విమర్శించారు. కనీసం పాదయాత్ర ముగింపు తర్వాత అయినా చంద్రబాబు మనిషిగా మారాడన్నది సందేహమేనని ఆమె ఎద్దేవా చేశారు. మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకి ఈ జన్మలో మార్పు రాదని, టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కుట్రలు ఎక్కువరోజులు సాగవని ముచ్చర్ల సభలో షర్మిల అన్నారు.
0 comments:
Post a Comment