వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి సెక్యూరిటీ ఎందుకు తగ్గించారని ఆ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒక ప్రజానాయకుడికి రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ఆయన అడిగారు. ప్రభుత్వం ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్ధం కావడంలేదన్నారు. జగన్ కి ఎలాంటి ప్రమాదం జరిగినా రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. అమలాపురంలో అంబేద్కర్ విగ్రహాలను కూల్చినవారిని అరెస్ట్ చేయమని అడిగితే, అడిగిన వారిని అరెస్ట్ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ దళిత వ్యతిరేక విధానాల పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ప్రజలు అభిమానంతో ప్రతిష్టించుకుంటే దానిని ఒక మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు కూల్చాలనడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు రాజకీయ ఆలోచన ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవాలన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణానికి ఆధ్యుడు చంద్రబాబే అని ఆయన ఆరోపించారు. ఆ భూములు అతి తక్కువ ధరకు అమ్మినది ఆయన హయాంలోనేనని తెలిపారు. సిబిఐతో చంద్రబాబు స్నేహాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. |
Home »
» జగన్ కు సెక్యూరిటీ ఎందుకు తగ్గించారు?: జూపూడి
జగన్ కు సెక్యూరిటీ ఎందుకు తగ్గించారు?: జూపూడి
Written By ysrcongress on Monday, January 23, 2012 | 1/23/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment