చనిపోయిన వైఎస్సార్‌కు ఒక న్యాయం, బతికున్న చంద్రబాబుకు వేరొక న్యాయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చనిపోయిన వైఎస్సార్‌కు ఒక న్యాయం, బతికున్న చంద్రబాబుకు వేరొక న్యాయం

చనిపోయిన వైఎస్సార్‌కు ఒక న్యాయం, బతికున్న చంద్రబాబుకు వేరొక న్యాయం

Written By ysrcongress on Wednesday, January 25, 2012 | 1/25/2012

తనను దెబ్బతీయడానికి కాంగ్రెస్, టీడీపీ నీచ రాజకీయాలు చేస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ అన్నారు. సీబీఐ దర్యాప్తు దారి తప్పిందని ఆయన ఆరోపించారు. చనిపోయిన వైఎస్సార్‌కు ఒక న్యాయం, బతికున్న చంద్రబాబుకు వేరొక న్యాయం అన్నట్టుగా సీబీఐ వ్యవహరిస్తోందన్నారు. గుంటూరు జిల్లాలో ఓదార్పుయాత్ర చేస్తున్న జగన్ బుధవారం రాత్రి జంగమహేశ్వరంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అభిమానులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 

వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలకు ఇప్పటి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని విమర్శించారు. మహానేత పాలనలో పేదలకు మేలు జరిగిందని అన్నారు. ప్రభుత్వ పథకాలను పేదలకు దగ్గర చేసిన వైఎస్సార్‌ను రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ స్మరించుకుంటున్నారని చెప్పారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉందంటే దానికి కారణం వైఎస్సార్ అని అన్నారు. వైఎస్ సువర్ణయుగం మళ్లీ వస్తుందన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు కూడా రావని జగన్ అన్నారు.
Share this article :

0 comments: