వ్యాట్కు నిరసనగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం ధర్నా కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టనున్నారు. వస్త్రాలపై రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 5 శాతం వ్యాట్కు నిరసనగా జగన్ ధర్నా నిర్వహిస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. నరసరావుపేట ఆర్డీవో కార్యాలయం సమీపంలోని వైఎస్ఆర్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలో జగన్ పాలుపంచుకుంటారు.
ఓదార్పుయాత్రలో భాగంగా జగన్ గురువారం రాత్రికి నరసరావుపేటకు చేరుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గజ్జల బ్రహ్మారెడ్డి నివాసంలో బస చేస్తారు. రేపు ఉదయం 9 గంటలకు రామిరెడ్డిపేటలోని కేర్ పబ్లిక్ స్కూల్ దగ్గరున్న వైఎస్ రాజశేఖరరెడ్డి రహదారి ప్రవేశద్వారాన్ని ప్రారంభిస్తారు. అక్కడ మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం వైఎస్ఆర్ చౌక్ దగ్గర జరిగే ధర్నాలో పాల్గొంటారు.
ఓదార్పుయాత్రలో భాగంగా జగన్ గురువారం రాత్రికి నరసరావుపేటకు చేరుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గజ్జల బ్రహ్మారెడ్డి నివాసంలో బస చేస్తారు. రేపు ఉదయం 9 గంటలకు రామిరెడ్డిపేటలోని కేర్ పబ్లిక్ స్కూల్ దగ్గరున్న వైఎస్ రాజశేఖరరెడ్డి రహదారి ప్రవేశద్వారాన్ని ప్రారంభిస్తారు. అక్కడ మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం వైఎస్ఆర్ చౌక్ దగ్గర జరిగే ధర్నాలో పాల్గొంటారు.
0 comments:
Post a Comment