ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అక్రమ ఆస్తుల వ్యవహరంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబుతో సహా 17 మందికి సంబంధించిన అక్రమ ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని పిటిషన్లో విజయమ్మ పేర్కోన్నారు. 45 పేజీలు ఉన్న పిటిషన్ను విజయమ్మ దాఖలు చేశారు. 14 పేజిలలో కారణాలను వివరించారు. శనివారం నుంచి సుప్రీం కోర్టుకు వేసవి సెలవులు కావడంతో.. సెలవుల అనంతరం వైఎస్ విజయమ్మ పిటిషన్ విచారణకు రానుంది.
చంద్రబాబు ఆస్తుల అంశంలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఒక బెంచ్ విచారణకు ఆదేశించగా.. అదే తరుణంలో మరో బెంచ్ కొట్టివేసిందని.. ఇది సరైనదేనా అని విజయమ్మ ప్రశ్నించారు.
జస్టిస్ రోహిణిపై అనేక ఆరోపణలు, సందేహాలు ఉన్నాయని పిటిషన్లో తెలిపారు. అయితే ఈకేసును విచారించవద్దని రోహిణిని ముందే కోరామని విజయమ్మ తెలిపారు. అయితే తప్పుకోకుండా... ఈ కేసును కొట్టివేయడం సరైనదేనా అని విజయమ్మ పిటిషన్లో పేర్కొన్నారు. ఇంకా పిటిషన్లో విజయమ్మ పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
చంద్రబాబు ఆస్తుల అంశంలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఒక బెంచ్ విచారణకు ఆదేశించగా.. అదే తరుణంలో మరో బెంచ్ కొట్టివేసిందని.. ఇది సరైనదేనా అని విజయమ్మ ప్రశ్నించారు.
జస్టిస్ రోహిణిపై అనేక ఆరోపణలు, సందేహాలు ఉన్నాయని పిటిషన్లో తెలిపారు. అయితే ఈకేసును విచారించవద్దని రోహిణిని ముందే కోరామని విజయమ్మ తెలిపారు. అయితే తప్పుకోకుండా... ఈ కేసును కొట్టివేయడం సరైనదేనా అని విజయమ్మ పిటిషన్లో పేర్కొన్నారు. ఇంకా పిటిషన్లో విజయమ్మ పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
0 comments:
Post a Comment