కాంగ్రెస్‌కు, ఎమ్మెల్సీకి ఎస్వీ గుడ్‌బై - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్‌కు, ఎమ్మెల్సీకి ఎస్వీ గుడ్‌బై

కాంగ్రెస్‌కు, ఎమ్మెల్సీకి ఎస్వీ గుడ్‌బై

Written By news on Thursday, May 10, 2012 | 5/10/2012

కర్నూలు, న్యూస్‌లైన్: వైఎస్ కుటుం బాన్ని వేధింపులకు గురి చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ ఎస్.వి.మోహన్‌రెడ్డి తన పదవికి, కాంగ్రెస్ పార్టీ సభ్య త్వానికి రాజీనామా చేసి నట్లు బుధ వారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. వైఎస్ రెక్కల కష్టం మీద పదవులు అనుభవిస్తున్న కిరణ్ సర్కార్ ఆయన కుటుంబాన్ని అడుగడుగునా ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. ఓదార్పు యాత్రలో వైఎస్ జగన్‌కు వస్తున్న జనాదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్, టీడీపీలు కుట్ర పన్ని సీబీఐ పేరిట వేధిం పులకు పాల్పడుతున్నాయన్నారు.

వైఎస్ హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేక రాష్ట్రం లో 650 మంది మరణించారని, వీరి కుటుంబాలకు ఏఐసీసీ తరఫున లక్ష రూపాయలు అందజేస్తామని ప్రకటించిన ప్రభుత్వం నేటికీ నయా పైసా ఇవ్వలేదన్నా రు. వైఎస్ జగన్‌ను అప్రతిష్ట పాలు చేసేందుకు కాంగ్రెస్, టీడీపీలు చేస్తున్న కుట్ర లను ప్రజలు గమనిస్తున్నారని, వారంతా ఆయనకు అండగా నిలుస్తారన్నారు. సాక్షి పేపర్, చానల్ అకౌంట్లను సీబీఐ స్తంభింపజేయడం చూస్తుం టే రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించిన భావన కలుగుతోందన్నారు. వాస్తవాలను జీర్ణించుకోలేక మీడియా గొంతునొక్కాలనుకోవడం సరికాదన్నారు. ఆయన తన రాజీనామాను ఫ్యాక్స్ ద్వారా శాసనమండలి చైర్మన్ చక్రపాణికి పంపారు
Share this article :

0 comments: