బ్రహ్మసముద్రం (అనంతపురం), న్యూస్లైన్: అటుగా వచ్చిన వైఎస్ జగన్ను చూడటానికి వెళ్లొచ్చారనే కారణంతో 130 మంది ఉపాధి కూలీలకు ఆబ్సెంట్ వేసిన వైనమిది. అనంతపురం జిల్లా మామిడూరు గ్రామంలో శుక్రవారం డ్రైలాండ్ హార్టికల్చర్ కింద 130 మంది కూలీలు ట్రెంచ్ పనులు చేస్తున్నారు. ఉప ఎన్నిక ప్రచార నిమిత్తం అటువైపుగా జగన్మోహన్రెడ్డి వచ్చారని తెలుసుకున్న కూలీలు పనులు ఆపి పరుగు పరుగున వెళ్లారు. కాసేపటి తర్వాత తిరిగి వచ్చారు. తీరా ఇంటికి వెళ్లేటప్పుడు చూస్తే మస్టర్లో ఆ 130 మంది పేర్లు నమోదు కాలేదు. అంటే వారు పనికి రాలేదని నమోదు చేశారు. కూలీలు గోవిందు, రాజన్న, నాగరాజు, మంజునాథ, హనుమంతు, గంగాధర్ తదితరులు నిలదీయగా.. అధికారులు ఇక్కడకు వచ్చినపుడు మీరు కనిపించలేదని ఏపీఓ వెంకటేశ్ నాయక్ పేర్కొన్నారు. కొలత ప్రకారం కూలి ఇవ్వడానికి ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. కాగా రిజిస్టర్లో పేర్లు నమోదు కానందున తమకు ఒక రోజు కూలి రానట్లేనని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు.
Home »
» జగన్ను చూసేందుకు వెళ్లారని కూలి కట్
జగన్ను చూసేందుకు వెళ్లారని కూలి కట్
Written By news on Saturday, May 12, 2012 | 5/12/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment