సాక్షి గ్రూప్ సంస్థల బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసే అధికారం సిబిఐకి లేదని - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సాక్షి గ్రూప్ సంస్థల బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసే అధికారం సిబిఐకి లేదని

సాక్షి గ్రూప్ సంస్థల బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసే అధికారం సిబిఐకి లేదని

Written By news on Wednesday, May 9, 2012 | 5/09/2012

సాక్షి గ్రూప్ సంస్థల బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసే అధికారం సిబిఐకి లేదని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అన్నారు. వైఎస్ జగన్మోహన రెడ్డి ఆస్తులకు సంబంధించిన కేసులో ఒకే చార్జీషీటు వేయకుండా విడతలు వారీగా వేయడం సిబిఐది దురుద్దేశ పూరితమేనన్నారు. సిబిఐ చర్యలు కోర్టులో నిలబడవని ఆయన చెప్పారు. జగన్‌ ఆస్తులపై ఆరోపణలు మోపిన సిబిఐకే వాటిని నిరూపించాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. కోర్టు ఆదేశించకపోయినప్పటికీ సాక్షి గ్రూపు బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడం సిబిఐ తొందరపాటు చర్య అన్నారు. సిబిఐ తప్పుడు విధానాలతో జగన్‌ను వేధిస్తుందని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. సిబిఐ చర్యలు జగన్‌పై ప్రజల్లో సానుభూతిని పెంచేలా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
Share this article :

0 comments: