వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర మంగళవారం పెందుర్తి నియోజకవర్గంలోని అయ్యన్నపాలెం నుంచి ప్రారంభమైంది. గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి తలపెట్టిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని ఆమె పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ప్రాజెక్టు వివరాలను ఈ సందర్భంగా ఆమెకు వివరించారు. గుల్లేపల్లి, పెదనాయుడుపాలెం, సబ్బవరం, అసకపల్లి, పైడివాడ తదితర గ్రామాల మీదుగా ఆమె పాదయాత్ర సాగుతోంది. అయితే షర్మిల చేపట్టిన పాదయాత్ర మంగళవారం 197వ రోజుకు చేరుకుంది.
గుల్లేపల్లి మీదుగా సాగి పెదనాయుడుపాలెం సమీపంలో లంచ్ చేస్తారు. సబ్బవరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అసకపల్లి మీదుగా పైడివాడ చేరుకుంటారు. రాత్రికి గ్రామ సమీపంలో బస చేస్తారు.
పర్యటించే ప్రాంతాలు అయ్యన్నపాలెం, గుల్లేపల్లి, పెదనాయుడుపాలెం, సబ్బవరం, అసకపల్లి, పైడివాడ |
Home »
» అయ్యన్నపాలెం నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం
అయ్యన్నపాలెం నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం
Written By news on Tuesday, July 2, 2013 | 7/02/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment