వైఎస్ ఉంటే ప్రాణహిత పూర్తయ్యేది:విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ ఉంటే ప్రాణహిత పూర్తయ్యేది:విజయమ్మ

వైఎస్ ఉంటే ప్రాణహిత పూర్తయ్యేది:విజయమ్మ

Written By news on Tuesday, July 2, 2013 | 7/02/2013

నిజామాబాద్: దివంతగ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయ్యేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. నిజామాబాద్లో ఈరోజు జరిగి పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సదస్సులో ఆమె ప్రసంగించారు. సమావేశం ప్రారంభంలో తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన వారికి పార్టీ తరపున నేతలు నివాళులర్పించారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారికి కూడా నేతలు నివాళులర్పించారు.

నిజామాబాద్ జిల్లాకు వైఎస్ఆర్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారని విజయమ్మ తెలిపారు. గుత్పా, అలీసాగర్ జలయజ్ఞం ప్రాజెక్టుల ద్వారా నీళ్లు అందుతున్నాయని చెప్పారు. నిజామాబాద్ మెడికల్ కాలేజీ, తెలంగాణ యూనివర్సిటీ, ఎల్లారెడ్డిలో డిగ్రీకాలేజీ వైఎస్ వల్లే వచ్చాయని ఆమె తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం కోసం కార్యకర్తలు అందరూ కలసికట్టుగా కృషి చేయాలని పిలుపు ఇచ్చారు.

Share this article :

0 comments: